SSMB28 Movie | ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రెటీలు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా ‘SSMB28’. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు కమర్షియల్గా అంతగా సక్సెస్ సాధించకోపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలు టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి టీఆర్పీను సొంతం చేసుకుంటాయి. దాదాపు 12ఏళ్ళ తర్వాత వీళ్ళ కాంబోలో మూడో చిత్రం తెరకెక్కుతుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే పూజా కార్యక్రమాలు జరుపకున్న ఈ చిత్రం సెప్టెంబర్లో షూటింగ్ మొదలు పెట్టింది.
ఫస్ట్ షెడ్యూల్ను కూడా పూర్తి చేసుకుంది. కారణాలేంటో తెలియదు గానీ, కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మరోసారి షూటింగ్ను కొత్తగా స్టార్ట్ చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుందట. దాంతో షూటింగ్ను కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ లోపు మహేష్ తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. దాంతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన బిగ్ అప్డేట్ను చిత్ర నిర్మాత సోషల్ మీడియాలో వెల్లడించాడు.
నాగవంశీ.. మేము సిద్ధమైయ్యాము. చాలా కాలంగా ఎదురు చూస్తున్న SSMB28 రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి నాన్ స్టాప్గా కొనసాగుతుంది. థియేటర్లో బ్లాక్బస్టర్ చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్తో మహేష్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో మహేష్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
We're all set!! Long awaited #SSMB28 regular shoot will start from January, non-stop. Get ready to witness a blockbuster entertainer in theatres! 🔥🌟
SUPERSTAR @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman #PSVinod #ASPrakash @NavinNooli @haarikahassine pic.twitter.com/q6DZMwowvh
— Naga Vamsi (@vamsi84) December 10, 2022