సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పరశురాం తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట చిత్రం నుండి టీజర్ విడుదల చేసిన మేకర్స్ ఫ్యాన్స్కి పట్టలేని ఆనందాన్ని అందించారు. ఈ టీజర్ ప్రస్తుతం రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.ఇక మహేష్- త్రివిక్రమ్ మూవీకి సంబంధించిన మూవీకి సంబంధించి కూడా ఓ అప్డేట్ ఇచ్చారు.
అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మరోసారి త్రివిక్రమ్, మహేష్ కాంబో రాబోతుండడంతో ఫ్యాన్స్ మరో సూపర్ హిట్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ‘#SSMB28’ అనే వర్కింగ్ టైటిల్తో సినిమా అనౌన్స్ చేసిన మేకర్స్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో నటించే హీరోయిన్తోపాటు.. టెక్నికల్ టీమ్ను పరిచయం చేస్తూ.. ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా ప్రకటించిన మేకర్స్.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్గా.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్గా.. మది సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. అయిత నిర్మాత నాగవంశీ.. చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా యాక్షన్ జోనర్లో తెరకెక్కించినున్నట్టు స్పష్టం చేస్తూ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేశాడు.