Guntur kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28). త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. అంతా అనుకున్నట్టుగానే త్రివిక్రమ్ టీం. ఈ చిత్రానికి గుంటూరు కారం టైటిల్నే ఫిక్స్ చేసింది.
తాజాగా గుంటూరు కారం మాస్ ట్రీట్ వీడియోను లాంఛ్ చేశారు మేకర్స్. ఏందట్టా చూస్తున్నవ్.. బీడీ త్రీడీలో కనబడుతుందా.. అంటూ మహేశ్ బాబు తనదైన స్టైల్లో చెబుతున్న డైలాగ్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. థమన్ గూస్ బంప్స్ తప్పించే బీజీఎం ప్రేక్షకుల కు సూపర్ మాస్ ట్రీట్ అందించబోతున్నట్టు తాజా వీడియోతో అర్థమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కు కావాల్సిన ట్రీట్ అందించేలా ఎస్ఎస్ఎంబీ 28 ఉండబోతుందని చెబుతోంది.
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా తర్వాత మూడోసారి వస్తున్న సినిమా కావడంతో ఎస్ఎస్ఎంబీ 28పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ మూవీని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..
Presenting you the Highly Inflammable #GunturKaaram 🔥
▶️ https://t.co/mV5CP3pNhD#SSKForever ❤️#SSMB28MassStrike Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/9dYfKjDWL6
— Pooja Hegde (@hegdepooja) May 31, 2023