టాలీవుడ్ క్రేజీ కాంబో జాబితాలో ముందుంటారు స్టార్ హీరో మహేశ్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన అతడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఖలేజా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఇద్దరు ఇపుడు హ్యాట్రిక్ హిట్టు కొట్టేందుకు ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) తో రెడీ అవుతున్నారని తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయాలని నిర్ణయించినట్టు త్రివిక్రమ్ టీం ఇటీవలే ప్రకటించింది.
అయితే ఈ తేదీలో మార్పులు చేసినట్టు తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. ఎస్ఎస్ఎంబీ28 విడుదల అక్టోబర్ 18కు వాయిదా పడే అవకాశాలున్నట్టు జోరుగా టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేయనున్నట్టు టాక్. సర్కారు వారి పాట సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్ అందించిన ఎస్ థమన్ ఈ చిత్రానికి మరోసారి మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఎస్ఎస్ఎంబీ 28లో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. శ్రీలీల సెకండ్ హీరోయిన్గా మెరవనుంది. శ్రీమతి మమత సమర్పణలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవగా.. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ చిత్రీకరణకు సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
మహేశ్ బాబు మరోవైపు పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యూనివర్సల్ స్టోరీతో అడ్వెంచరస్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సాగనున్న ఈ చిత్రం ఎస్ఎస్ఎంబీ 29గా రాబోతుంది.