RRR sequel | దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రామ్చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా దూసుకెళ్తూ.. కోట్లు రాబట్టింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం.. తాజాగా ప్రపంచ చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును (Golden Globe Awards) దక్కించుకుంది. సినిమాలోని ‘నాటునాటు’ పాట.. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. కాలిఫోర్నియాలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో.. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. చిత్రాన్ని కొనసాగించేందుకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చిందని తెలిపారు. ‘ఈ మూవీ సీక్వెల్పై మాకు కొన్ని మంచి ఐడియాలు వచ్చాయి. అయితే బలవతంగా సీక్వెల్ తీయకూడదని అనుకున్నాం. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ కు వస్తున్న ఆదరణ చూసిన తర్వాత ఇతర చిత్ర బృందంతో కలిసి మా నాన్నతో సీక్వెల్పై చర్చించా. అప్పుడే ఓ అద్భుతమైన ఆలోచన తట్టింది. ఆ ఆలోచన ఆధారంగా వెంటనే కథ రాయడం ప్రారంభించాం. అయితే స్క్రిప్ట్ పూర్తయ్యేదాకా సీక్వెల్ విషయంలో ముందుకెళ్లలేం. ప్రస్తుతం మేమంతా అదే పనిలో ఉన్నాం’ అని రాజమౌళి వెల్లడించారు.