పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్న చిత్రం రాధేశ్యామ్ ( Radhe Shyam). విజువల్ వండర్గా రాబోతున్న ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా సందడి చేయనుంది. ప్రభాస్, పూజాహెగ్డే యూనివర్సల్ లవ్ ట్రాక్ తో ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar) ఆధ్వర్యంలో రెడీ చేసిన రాధేశ్యామ్ ఫైనల్ కట్ పట్ల ప్రభాస్ సంతృప్తికరంగా లేడట.
దీంతో సినిమా కథనంపై సరైన అవగాహన పొందేందుకు గుడ్ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళిని ( SS Rajamouli) సాయం చేయాలని కోరాడట. జక్కన్న ప్రస్తుతం ప్రభాస్ టేబుల్ పక్కనే కూర్చొని సినిమాలో వచ్చే కొన్ని సీన్లను ప్రేక్షకులకు మరింత ఎక్జయిటింగ్గా అనిపించేలా చూస్తున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. సాహో సినిమాలాగా డిజాస్టర్ టాక్ రాకుండా..యావరేజ్ కన్నా ఎక్కువగా లేదంటే బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చేలా చేసేందుకు జక్కన్న సాయం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట ప్రభాస్.
మరి రాజమౌళి లాంటి లెజండరీ డైరెక్టర్ సలహాలు ఇస్తానంటే రాధేశ్యామ్ టీం కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పదు. బాహుబలి సినిమాతో ట్రెండ్ క్రియేట్ చేసిన జక్కన్న సాయం రాధేశ్యామ్కు ఏవిధంగా ఉపయోగపడుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.