‘ఇప్పటి వరకు మా సంస్థ భాగస్వామ్యంలో కొన్ని సినిమాలు నిర్మించాను. ఈ ఏడాది మా సంస్థ నుండి తొమ్మిది సినిమాలు రాబోతున్నాయి’ అన్నారు నిర్మాత సృజన్ యరబోలు. యస్ ఒరిజినల్స్ పతాకంపై ఈ ఏడాది తొమ్మిది సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘తొమ్మిది సినిమాలు దాదాపుగా చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్నాయి. వీటితో పాటు మరికొన్ని కథలు కూడా చర్చల దశలో వున్నాయి. కంటెంట్ ఓరియెంటెడ్గా కొనసాగే కొత్తరకం సినిమాలను నిర్మించాలనేది నా లక్ష్యం. సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్ కాంబినేషన్లో ‘పంచతంత్రం’ అనే సినిమాను, సంతోష్శోభన్తో ఓ ప్రేమకథ, సుమంత్ హీరోగా ‘అహం’, బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా ఓ సినిమా, కిరణ్ అనే యువదర్శకుడితో సినిమాతో పాటు ఓల్డ్మంక్ అనే టైటిల్తో ఓ చిత్రం నిర్మిస్తున్నాను’ అని తెలిపారు.