హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలయికలో రూపొందిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలు కమర్షియల్గా మంచి విజయాల్ని సాధించాయి. తాజాగా వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్నది. పీపుల్మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం అనౌన్స్మెంట్ పోస్టర్ను విడుదలచేశారు. కోల్కతాలోని హౌరాబ్రిడ్జ్, కాళీమాత విగ్రహాలతో కూడిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిర్మాత మాట్లాడుతూ ‘కుటుంబ అనుబంధాలు, వినోదం, ప్రేమ అంశాల కలబోతగా సాగే చిత్రమిది. కోల్కతా బ్యాక్డ్రాప్లో ఆసక్తికరంగా సాగుతుంది. భూపతిరాజా వినూత్నమైన పాయింట్తో కథను అందించారు. త్వరలో పూర్తి వివరాల్ని వెల్లడిస్తాం’ అని తెలిపారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రీకరణతో గోపీచంద్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే శ్రీవాస్ చిత్రం మొదలుకానుంది. ఈ చిత్రానికి కథ: భూపతిరాజా, సహనిర్మాత: వివేక్ కూచిభోట్ల.