Sriranga neethulu | టాలీవుడ్ యువ నటులు సుహాస్, కార్తీక్రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం శ్రీరంగనీతులు (Sriranga neethulu). ఈ సినిమాకు ప్రవీణ్కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తుండగా.. రాధావి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్తో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా.. మంచి స్పందన లభించింది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వుంటాయి. సరిగ్గా అలాంటి సినిమానే ఈ చిత్రం అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి డీఓపీ: టీజో టామీ, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, అజయ్ అరసాడ, ఎడిటింగ్: శశాంక్ ఉప్పటూరి.