నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా మారుతున్నారు. కేఎస్ఐ సినిమా అన్లిమిటెడ్ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘యానం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షేక్స్పియర్ రచన ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు కరుణాకరణ్ రూపొందిస్తున్నారు. ఈ సంస్థ లోగో, సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ ‘కరణాకరణ్ నాకు మంచి మిత్రుడు, దర్శకత్వ విభాగంలో సహచరుడు. నా నిర్మాణంలో మంచి సినిమా చేస్తాడని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ ఇది’అన్నారు.