సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి శోభన్బాబు’. ప్రశాంత్కుమార్ దిమ్మల దర్శకుడు. విష్ణుప్రసాద్, సుస్మిత కొణిదెల నిర్మాతలు. ఈచిత్ర టీజర్ను బుధవారం అగ్ర కథానాయిక సమంత విడుదల చేసింది. ఈ సందర్భంగా సుస్మిత కొణిదెల మాట్లాడుతూ ‘మా సంస్థకు ఈ సినిమా చాలా ప్రత్యేకం. చక్కటి భావోద్వేగాలతో ఆకట్టుకునే కథ ఇది. కథానుగుణంగా మంచి బాణీలు కుదిరాయి.
బాబాయ్ నాగబాబుగారు ప్రత్యేకమైన పాత్ర చేశారు. త్వరలోనే విడుదల చేస్తాం’ అన్నారు. శ్రీదేవి, శోభన్బాబు జంట ప్రేమకథ ఇదని.. చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని మరో నిర్మాత విష్ణు ప్రసాద్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ రామస్వామి, సంగీతం: కమ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శరణ్య పొట్ల, దర్శకత్వం: ప్రశాంత్కుమార్ దిమ్మల.