బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో కెప్టెన్సీ టాస్క్ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్లోని రెండో లెవల్ సాగరా సోదరా అనే టాస్క్ జరిగింది. ఈ ఆటకి ఎల్లో టీం తరుపున మానస్ సంచాలకుడిగా ఉండగా.. బ్లూ టీం తరుపున శ్రీరామ్ సంచాలకుడిగా ఉన్నాడు. అయితే ఈ పోటీలో ఎల్లో టీం 33.3 మీటర్స్.. బ్లూ టీం 33 మీటర్స్ పొడువు ఉండగలిగాయి ఎల్లో టీం లో ఉన్న శ్వేత చివరి క్షణంలో కిందకి పడటంతో వివాదం చెలరేగింది.
సంచాలకులు కూడా సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో బిగ్ బాస్ఆ టాస్క్నే రద్దు చేశారు. దీంతో శ్రీరామచంద్ర ఓవర్ ఎగ్జయిట్మెంట్లో డ్యాన్స్ చేశాడు. రవి టాస్క్ రద్దయినందుకు సిగ్గుతో తల దించుకోవాలని చురకలంటించాడు. సిగ్గు మీకు, కానీ మాకవసరం లేదు అని కౌంటరిచ్చింది ప్రియ. ఆ తర్వాత మళ్లీ ‘పంతం నీదా నాదా’ టాస్క్ మొదలు కాగా ఎల్లో టీమ్ రెచ్చిపోయి ఆడింది.
ఈ టాస్క్లోను బానే గొడలు జరిగాయి. శ్వేత కొట్టిందని సిరి చెప్పడంతో ఒళ్లు మండిన ప్రియ సాయంత్రం కాగానే ఆమెకు దెయ్యం పూనుతుందని ఫైర్ అయింది. ఇక శ్రీరామ్ చంద్ర..రవి మధ్య డిస్టెన్స్ పెరగగా, దానిని సాల్వ్ చేద్దామని రవి అనగా, ఆ సమయంలో కోపోద్రిక్తుడైన శ్రీరామ్… నేను తెలుగువాళ్లకు చేరవయ్యేందుకు ఈ ఫ్లాట్కి వచ్చా.వాళ్లు 50 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ల ముఖానే కొడతా అన్నాడు.
శ్రీరామ్-మానస్ల మధ్య కూడా డిస్కషన్ నడిచింది. నా వయసు 34.. నీ వయసు 28.. ఎలా చేయాలో నాకు తెలుసు నీకు మెచ్యూరిటీ లేదు అని అన్నాడు శ్రీరామ్.. వయసుకి మెచ్యురిటీకి సంబంధం లేదు అని మానస్ స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చాడు.