బుల్లితెర యాంకర్స్లో ఎప్పుడు చాలా జోష్తో కనిపించే యాంకర్ శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బుల్లితెరపై సూపర్ యాక్టివ్ యాంకర్గా రాణిస్తున్న శ్రీముఖి వెండితెరపై కూడా సందడి చేస్తుంటుంది.ఇటీవల శ్రీముఖి క్రేజీ అంకుల్స్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించింది.ఈ సినిమా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోకపోయిన శ్రీముఖికి మంచి పేరు తెచ్చిపెట్టింది.
శ్రీముఖి సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెకు అచ్చమైన తెలుగులో నాలుగు పేజీల లేఖ రాయగా, దానిని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. లేఖలో ఆమె టాలెంట్ని ఆకాశానికి ఎత్తడంతో పాటు కెరీర్లోని మలుపులు, ముఖ్య ఘట్టాల గురించి చెప్పుకొచ్చాడు. సదరు అభిమాని పేరు వెంకట్ అని తెలుస్తుండగా, అంతకు మించిన వివరాలు ఏవీ లేవు.
సోషల్ మీడియా యుగంలో అచ్చతెలుగులో నాలుగు పేజీల లేఖ రాయడం తనకు ఎంతో ఆనందాన్ని అందించిందని పేర్కొంది శ్రీముఖి. మీరెవరో తెలియదు కాని, మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొంది.