Om Bheem Bush | టాలీవుడ్ యువ నటులు శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్(No Logic Only Magic) అనేది ఉపశీర్షిక. రీతూవర్మ హీరోయిన్గా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు ‘హుషార్’ (Husharu) ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
గుప్త నిధులు కోసం సైంటిస్టులమని చెప్పి భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. ఆ ఊరిలో ఏ సమస్య అయినా పరిష్కరిస్తామని గ్రామస్తులను నమ్మిస్తారు. బ్యాంక్ బ్రోస్ క్లబ్ను పెడతారు. అయితే ఆ ఊరిలో ఉండే ఓ సన్యాసి మీరు నిజంగా మగాళ్లయితే సంపంగి మహల్లో ఉన్న నిధి తీసుకురావాలని ఆ ముగ్గురికి సవాల్ చేస్తారు. దీంతో ఆ నిధిని కనిపెట్టాడానికి పెట్టడానికి మహల్ లోకి ఎంట్రీ ఇస్తారు. అయితే ఈ ముగ్గురు మహల్ లోకి వెళ్లిన అనంతరం జరిగిన సంఘటనలు ఏంటి.? అసలు ఆ మహల్ లో ఏముంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం కామెడీ ఎంటర్ టైనర్ గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక బ్రోచేవారెవరురా తర్వాత (శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి) కాంబో రిపీట్ అవుతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. వి.సెల్యులాయిడ్తో కలిసి సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. యు.వి.క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తోంది.