Sree Vishnu | టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతేడాది సామజవరగమన అంటూ హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం ఓ భీమ్ బుష్ అంటూ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లైన్లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా శ్రీ విష్ణు తన తదుపరి ప్రాజెక్ట్ను చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ను రేపు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు అనౌన్స్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఎక్స్ వేదికగా తెలుపుతూ..”టీజీ విశ్వప్రసాద్ నిర్మిత.. హసిత్ గోలి గాడి రాత, తీతలో.. మన శ్రీవిష్ణు గాడి కొత్త సినిమా నామకరణం అట.. ముహూర్తం: మాఘ బహుళ పంచమి ఉ ౧౧:౪౫ కి.. అదే, రేపు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు” అంటూ రాసుకోచ్చింది. ఇక అచ్చ తెలుగు సినిమాగా రానున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
విశ్వప్రసాద్ నిర్మిత ..
హసిత్ గోలి గాడి రాత, తీతలో
మన శ్రీవిష్ణు గాడి కొత్త సినిమా నామకరణం అట. 🤘ముహూర్తం: మాఘ బహుళ పంచమి ఉ ౧౧:౪౫ కి..
అదే, 29th Feb 11:45 am.రేపు కలుద్దాం.#అచ్చతెలుగుసినిమా #PMF32 #SreeVishnugaadiCinema@sreevishnuoffl @vishwaprasadtg @hasithgoli… pic.twitter.com/p0bOZgBiKq
— BA Raju’s Team (@baraju_SuperHit) February 28, 2024