హాలివుడ్ సినిమా ‘స్పైడర్ మ్యాన్ నోవే హోమ్’ భారత్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజే ఇండియాలో రూ.41.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ (రూ.32.67 కోట్ల నెట్) సాధించింది. దీంతో 2021 సంవత్సరంలో దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ రికార్డు ఇప్పటివరకు అక్షయ్ కుమార్ నటించి సూర్యవంశీ పేరిట ఉంది. ఇప్పుడా రికార్డు స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ సొంతం చేసుకుంది. కానీ రెండో రోజు సౌత్ ఇండియాలో ‘పుష్ప’ గట్టి పోటీ ఇచ్చేసరికి కలెక్షన్లు తగ్గాయి.
‘స్పైడర్ మ్యాన్ నోవే హోమ్’ ఇండియాలో డిసెబంర్ 16న విడుదలైంది. మొదటి రోజు గురువారం రూ. రూ.32.67 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. రెండవ రోజు శుక్రవారం రూ.20.37 కోట్లు సాధించింది.
బాలీవుడ్-టాలీవుడ్లకు సవాళ్లు విసురుతున్న అవెంజర్
అమెరికాలో స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ క్రేజ్ వల్ల అక్కడ మిగతా సినిమాలకు థియేటర్లు దొరకడంలేదు. అల్లు అర్జున్ నటించిన పుష్పకు కూడా అక్కడ కేవలం తెలుగు వెర్షన్కు మాత్రమే థియేటర్లు దక్కాయి. మిగతా భాషలలో పుష్ప కాస్త ఆలస్యంగా విడుదలవుతుందని సమాచారం. అలాగే భారత్లో కూడా వచ్చే వారం విడుదలయ్యే ’83’ సినిమాకు పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరకడం కష్టమని డిస్ట్రిబూటర్లు అంటున్నారు.
ఇప్పటివరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ సినిమాలతో పోలిస్తే స్పైడర్ మ్యాన్ నోవే హోమ్లో ఫ్యాన్స్ను అలరించడానకి ప్రత్యేక ఆకర్షణలు ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా మరిన్ని రికార్డులు సొంతం చేసుకోనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.