Sruthi Haasan Hikes Her Remuneration | లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చి తన నటన, అభినయంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. ‘గబ్బర్ సింగ్’, ‘బలుపు’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’ వంటి సినిమాలతో తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది. దక్షిణాదిలో దాదాపు స్టార్ హీరోలందరితో శృతి హాసన్ నటించింది. చాలా కాలం తర్వాత ‘క్రాక్’తో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. కేవలం నటిగానే కాకుండా సింగర్ గాను ఈమెకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇదిలా ఉంటే తాజాగా శృతి హాసన్ తన పారితోషికాన్ని అమాంతం పెంచిందట.
కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ అమ్మడు గతంలో ఒక్కో సినిమాకు కోటిన్నర తీసుకునేదట. కాగా తాజాగా శృతి తన రెమ్యునరేషన్ను కోటి రూపాయిలు పెంచి రూ.2.5-రూ.3 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. సక్సెస్ రేటు కూడా అధికాంగా ఉండటంతో నిర్మాతలు కూడా అడిగినంత పారితోషికాన్ని ఇస్తున్నారట. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్తో కలిసి ‘సలార్’లో నటిస్తుంది. దీనితో పాటుగా బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న ‘NBK107’లోనూ ఈమెనే హీరోయిన్గా ఎంపికైంది. ఇక చిరు ‘వాల్తేరు వీరయ్యలో’నూ మేకర్స్ శృతినే ఎంపిక చేశారు. ఇలా వరుసగా స్టార్ హీరోతో సినిమాలు చేస్తుండటంతో రెమ్యునరేషన్ను డబుల్ చేసిందట.