సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా అన్నాత్తె చిత్రంతో ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. అన్నాత్తె చిత్రం తర్వాత రజనీకాంత్ సినిమాలు చేస్తాడా, చేస్తే ఎవరి డైరెక్షన్లో చేస్తాడు వంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. కొద్ది రోజులక్రితం అనారోగ్యంబారిన పడ్డ రజనీకాంత్ రీసెంట్గా వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.
రజనీకాంత్ తదుపరి సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రజనీకి ఇటీవల ఎంతో మంది డైరెక్టర్లు కథ వివరించగా, అందులో యువ దర్శకులతో పాటు ఆయన కూతురు సౌందర్య కూడా ఉందట. అయితే ఈమె డైరెక్షన్లో చివరిగా ఓ మూవీ చేసి నటనకు కూడా గుడ్ బై చెప్పాలని తలైవా భావిస్తున్నారట. కాగా ఇప్పటికే సౌందర్య.. రజనీతో యానిమేటెడ్ మూవీని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.