కలియుగ కర్ణుడు, రియల్ హీరో అంటూ అభిమానులతో పిలిపించుకుంటున్న సోనూసూద్ చేతికి ఎముక లేదన్నట్టు సాయాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒకవైపు ఆపదలో ఉన్నవారికి సాయాలు చేస్తూనే, మరోవైపు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి ఫ్రీగా ప్రమోషన్ చేస్తూ అండగా నిలబడుతున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన సోనూసూద్.. తాజాగా మరో అడుగు ముందుకేశారు.
‘సోనూ ఛారిటీ ఫౌండేషన్’ ద్వారా ఉచితంగా ఈఎన్టీ సర్జరీ సేవలు అందించనున్నట్లు సోనూసూద్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ‘ఈఎన్టీ సర్జరీలను ఉచితంగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇకపై.. వాసన, రుచి, శబ్దం చక్కగా ఆస్వాదిద్దాం’ అనే క్యాప్షన్ జోడించారు. అంతేకాకుండా సేవలను ఎలా ఉపయోగించుకోవాలో దానికి సంబంధించిన వెబ్సైట్ను అందుబాటులో ఉంచారు.
ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలంటే..
ఇటీవల బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇల్లు, కార్యాలయాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్ ఎగ్గొట్టాడని ఐటీ అధికారులు వెల్లడించారు. దానిపై స్పందించిన సోనూ.. ప్రతీ భారతీయుడి ప్రార్థనలు ప్రభావం చూపుతాయని, కష్టమైన రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణం సాగుతుందని అన్నారు. తను పొదుపు చేసే ప్రతీ రూపాయి పేదల విలువైన జీవితాలను కాపాడటానికే అని అన్నారు.