ఆది సాయికుమార్, నువేక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘అతిధి దేవోభవ’. పొలిమేర నాగేశ్వర్ దర్శకుడు. ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని ‘బాగుంటుంది నువ్వు నవ్వితే..’ అనే పల్లవితో సాగే ప్రేమగీతాన్ని సోమవారం విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు శేఖర్చంద్ర స్వరాల్ని సమకూర్చారు. సిధ్శ్రీరామ్ గాయకుడు. ‘ప్రేమికుల మనసులోని అందమైన భావాలకు దర్పణంలా ఈ గీతం సాగుతుంది. ఈ పాటకు సోషల్మీడియాలో చక్కటి ఆదరణ లభిస్తున్నది. విభిన్న ప్రేమకథా చిత్రమిది. వినోదం, సెంటిమెంట్ ప్రధానంగా ఆకట్టుకుంటుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: అమరనాథ్ బొమ్మిరెడ్డి, నిర్మాతలు: రాజబాబు మిర్యాల, అశోక్రెడ్డి మిర్యాల.