తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. మల్లిక్రామ్ దర్శకుడు. చంద్రశేఖర్ మోగుళ్ళ నిర్మాత. తాజాగా చిత్రంలోని ఊరేంటి.. పేరేంటి అనే లిరికల్ సాంగ్ను విడుదల చేసింది చిత్రబృందం. రథన్ సంగీత సారథ్యంలో స్వరపరచిన ఈ పాటకు చక్కటి స్పందన వస్తోందని ఆనందం వ్యక్తం చేసింది చిత్రయూనిట్. నేటి యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు: ఎస్ ఒరిజినల్, మహా తేజ క్రియేషన్స్, కథ: ప్రశాంత్ వర్మ, స్క్రీన్ప్లే, మాటలు: లక్ష్మీ భూపాల్.