Mirai | ‘హనుమాన్’తో భారీ విజయాన్ని అందుకున్న తేజ సజ్జా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మిరాయ్’ ద్వారా మళ్లీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే .. మంచు మనోజ్ ఇందులో ప్రతినాయకుడిగా ధీటైన పాత్రలో కనిపించనున్నారు. శ్రియ, జయరామ్, జగపతిబాబు వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్లో థియేటర్లలో విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా విడుదలైన ఫస్ట్ సాంగ్ ప్రోమో సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. “వైబ్ ఉందిలే బేబీ… వైబ్ ఉందిలే… ఈ గ్లోబ్ను ఊపే వైబ్ ఉందిలే…” అంటూ సాగే పాట ఫుల్ ఎనర్జీతో, స్టైలిష్ విజువల్స్తో ఆకట్టుకుంటోంది. తేజ సజ్జా – రితికా జంటపై ఈ పాటను పోలంకి విజయ్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించారు. పాటకు కృష్ణకాంత్ మాస్టర్ఫుల్ లిరిక్స్ అందించగా, మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి తమ మ్యూజిక్ మ్యాజిక్ను మళ్లీ చూపించారు. పాటను ఫేమస్ బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ ఆలపించడంతో, ఈ సాంగ్కు పాన్ ఇండియా వైబ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ పాట నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
పాటకి మంచి రెస్పాన్స్ వస్తుంది. మిరాయ్ సినిమాతో తేజ సజ్జా మరోసారి సూపర్హీరో ఫీల్ కలిగించే కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గ్లోబల్ స్కేల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్కి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. వైవిధ్యమైన కాస్సెప్ట్లతో ప్రేక్షకులని అలరిస్తున్న తేజ సజ్జా ఈ చిత్రంతోను మంచి హిట్ కొడతాడని అంటున్నారు.