కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా అనే సందేశాత్మక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై డైమండ్ రత్న బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ , తనికెళ్ళ భరణి , అలీ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
సన్ ఆఫ్ ఇండియా మూవీ టీజర్కు టైం ఫిక్స్ చేశారు.30 సంవత్సరాల క్రిందట జూన్ 4వ తేదీ న మోహన్బాబు హీరోగా రూపొందిన “అసెంబ్లీరౌడీ” చిత్రం విడుదలై అనేక సంచలనాల్ని సృష్టించిన విషయం తెలిసిందే. అటువంటి శుభదినాన ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ విడుదల చేయబోతుండటం ఆనందంగా ఉందనీ , వాస్తవిక సంఘటనలతో ఈ చిత్రం రూపొందుతుందని మేకర్స్ పేర్కొన్నారు. చిత్రంలో మోహన్బాబు పాత్ర చిత్రణ శక్తివంతంగా సాగుతుందనీ , ఆయన శైలి సంభాషణలు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయనీ , సందేశంతో కూడుకున్న “సన్ ఆఫ్ ఇండియా ” మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించడం ఖాయం అంటుంది చిత్ర బృందం.