సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అన్నాత్తె సినిమా షూటింగ్ పూర్తి చేసి సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేంద్రం ప్రత్యేక అనుమతితో జూన్ 19న అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడి మయో క్లినికల్ హాస్పిటల్లో రజనీకాంత్కు వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. అన్ని టెస్టుల రిపోర్టు నార్మల్ అని తేలడంతో రజనీకాంత్ శుక్రవారం చెన్నైకి తిరిగొచ్చారు. తమ అభిమాన నటుడు ఆరోగ్యంగా తిరిగి రావడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో తన కూతురు సౌందర్య డైరెక్షన్లో సినిమా చేయనున్నాడంటూ కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తుంది. తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ చేసే చివరి చిత్రం అల్లుడు ధనుష్ డైరెక్షన్లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ని రజనీకాంత్ కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య నిర్మించనున్నారట. రజనీకాంత్ 170వ ప్రాజెక్ట్గా ఈ మూవీ రూపొందనుంది. ఇక 169వ సినిమా విషయానికి వస్తే దేశింగ్ పెరియసమి దర్శకత్వంలో సినిమా ఉంటుందని టాక్.చూడాలి వీటిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో.