Mahesh babu | సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అందులో అగ్ర హీరో మహేష్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబో ఒకటి. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం నిర్మాణ దశలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలు. త్వరలో హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది.
తాజా సమాచారం ప్రకారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 22న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ను విడుదల చేస్తారని, అదే రోజు టైటిల్ను ప్రకటిస్తారని సమాచారం. తనదైన శైలి వినోదం, భావోద్వేగాలతో చక్కటి కుటుంబ కథతో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్ను ఖరారు చేయొచ్చని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఈ టైటిల్తో పాటు మరికొన్ని టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని తెలిసింది. ఈ చిత్రం ఆగస్ట్లో ప్రేక్షకుల ముందుకురానుంది.