సంపూర్ణేష్బాబు, సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చంగలా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘పిల్లా పిల్లా..నన్ను చూసి నావే పిల్ల..నా కలలే నిజమయ్యేలా..’ అనే రెండో గీతాన్ని ఆదివారం విడుదల చేశారు. ‘మొదటి పాట అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరించింది. ఇప్పుడీ రెండో గీతం రొమాంటిక్ మెలోడీగా ఆకట్టుకుంటుంది. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వినోదంతో పాటు చక్కటి భావోద్వేగాలుంటాయి’ అని చిత్రబృందం పేర్కొంది. బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జాన్, సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాణ సంస్థ: క్యాన్స్ ఎంటర్టైన్మెంట్, మాంక్ ఫిలిమ్స్, కథ, దర్శకత్వం:
మన్మోహన్ మేనంపల్లి.