ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలి
కళాకారులకు త్వరలో డబుల్బెడ్రూం ఇండ్లు
కొయ్య బొమ్మల పారిశ్రామిక కేంద్రం కొత్త భవనానికి కృషి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్ టౌన్, మార్చి 21 : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిర్మల్ కొయ్యబొమ్మలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నా రు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ. 65లక్షలతో నూతనంగా నిర్మించిన నిర్మల్ కొయ్యబొమ్మల మౌలిక సదుపాయాల భవనంతో పాటు యంత్రాలను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హస్తకళల చైర్మన్ సంపత్కుమార్, ఎండీ శైలజ రా మయ్యర్ హాజరయ్యారు. కొయ్య బొమ్మల తయారీలో కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. భవన నిర్మాణానికి త్వరలో నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన కళాకారులకు డబుల్బెడ్రూం ఇండ్లతో పాటు త్వరలో పెన్షన్లను కూడా అందించేందుకు చర్యలు తీసుకంటామన్నారు.జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్వో రమేశ్ రాథోడ్, తహసీల్దార్ సుభాష్చందర్, టీ ఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నిర్మల్ కొయ్య బొ మ్మల పారిశ్రామిక కేంద్రం నిర్వాహకుడు శంకర్, హస్తకళల ఏడీ దిశ, హస్తకళల నిర్వాహకుడు సలీం, తదితరులు పాల్గొన్నారు.