యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం రాధే శ్యామ్. వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుకావట్లేదని అభిమానులు అందోళన చెందుతున్న వేళ. ఈ చిత్రం నుంచి వరుసగా పాటలను విడుదల చేస్తోంది చిత్రబృందం.
కొద్ది రోజుల క్రితం ఈ రాతలే అంటూ సాగిన ఈ పాట అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. నగుమోము తారలే అంటూ సాగే రెండో సాంగ్ కూడా మంచి విజువల్స్ తో అందరిని అలరించింది. ఇక కొద్ది సేపటి క్రితం సోచ్ లియా అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. మిథున్ సంగీతం అందిస్తున్న ఈ పాటను బాలీవుడ్ ఫేమస్ సింగర్ అయిన అరిజిత్ సింగ్ పాడటం జరిగింది. ఇందులో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. యూవీ క్రియేషన్స్ మరియు టీ సిరీస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ లవ్ డ్రామా నుంచి మేకర్స్ ఇప్పటికే ప్రభాస్ ఇంట్రడక్షన్ టీజర్ ను రిలీజ్ చేయగా, దానికి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. మరోవైపు హిందీలోనూ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. నిర్మాతలు ఈ సినిమా ట్రైలర్ను ఈ నెల 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. ఆరోజు కుదరకపోతే డిసెంబర్ 21న విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.