‘డీజే టిల్లు’సినిమా చుట్టూ మంచిహైప్ క్రియేట్ అయింది. అందరి అంచనాలను తగినట్లుగా సినిమా ఉంటుంది. ముఖ్యంగా యువతకు బాగా నచ్చుతుంది’అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి విమల్కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. నేడు ప్రేక్షకులముందుకురానుంది. గురువారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘సితార సంస్థలో పనిచేయడం చాలా గర్వంగా ఉంది. త్రివిక్రమ్గారు ఓ మార్గదర్శిలా మాతో ఉన్నారు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ఇది’అని చెప్పారు. ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తే నాన్స్టాప్ ఎంటర్టైనర్ ఇదని నిర్మాత నాగవంశీ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ట్రైలర్తోనే సగం విజయాన్ని అందుకున్నాం. డీజే టిల్లు పాత్రను నిజాయితీగా తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేశా. సిద్ధు తన పాత్రలో లీనమై నటించాడు. కొత్త దర్శకుడినైనా నన్ను నమ్మి నిర్మాత వంశీగారు పూర్తి సహకారం అందించారు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది’ అని పేర్కొన్నారు. ఈ సినిమా సంగీతం పెద్ద విజయం సాధించడానికి హీరో సిద్ధుకు ఉన్న మ్యూజిక్ సెన్స్ కారణమని గాయకుడు రామ్ మిర్యాల తెలిపారు. ఎక్కడ చూసినా ‘డీజే టిల్లు’పాటలు మార్మోగుతున్నాయని గీత రచయిత కాసర్ల శ్యామ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్సేన్, ప్రిన్స్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, రవికాంత్ పేరేపు తదితరులు పాల్గొన్నారు.