SJ Suryah|దర్శకుడు ఎస్జే సూర్య గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.దర్శకుడిగా ఖుషి సినిమాకి ఎంత మంచి స్థాయి వచ్చిందో.. నటుడిగా సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు సూర్య. ఇప్పుడు ఆయన `వీర ధీర శూర` చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. విక్రమ్ హీరోగా నటించిన మూవీ మార్చి 27న విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్లో టీమ్ సందడి చేసింది. చిత్రంలో చియాన్ విక్రమ్, దుషారా విజయన్ హీరోహీరోయిన్లుగా నటించగా.. పోలీసాఫీసర్ క్యారక్టర్ లో సూర్య కనిపించనున్నారు.
అయితే చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఎస్ జె సూర్య మాట్లాడుతూ ఖుషీ రోజులు కూడా గుర్తు చేసుకున్నారు. .. ఖుషి మూవీ కి దర్శకత్వం వహించిన సమయంలో ఖుషి మూవీ కాపీ చూసి సినిమా బాగుందని గాని బాగాలేదని గాని ఎవరు చెప్పకపోవడంతో చాలా బాధపడ్డాను. అయితే మొదటి రోజు సినిమా విడుదలయ్యాక కూడా సినిమా గురించి పెద్దగా ప్రస్తావన లేదు. తమిళ వెర్షన్ ఫస్ట్ కాపీని చెన్నైలో ఉదయం థియేటర్లో వేసాము. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది. ఏదో స్మశానంలో ఉన్నట్లు ఎవరు కూడా ఎలాంటి స్పందన లేకుండా కూర్చొని ఉన్నారు. నవ్వు కూడా ఎవరి ముఖంలో కనిపించలేదు. అదే అలా కంటిన్యూ అయి ఉంటే నేను సూసైడ్ చేసుకొని ఉండేవాడిని. ఎందుకంటే కొంచెం నాకు పిచ్చి ఉందని సూర్య తెలియజేశాడు.
అయితే రెండో రోజు నుండి ఖుషి మూవీ కి బ్రహ్మరధం పట్టారు జనాలు. అయితే ఈ మూవీ మొదటి రోజు టాక్ ఎలా అయితే ఉందో రెండో రోజు అలా ఉంటే మాత్రం చనిపోయేవాడిని.. కానీ నా అదృష్టం కొద్దీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే భవిష్యత్తులో కచ్చితంగా మెగా ఫోన్ పట్టి మళ్ళీ డైరెక్షన్ చేస్తాను అంటూ ఎస్ జె సూర్య స్పష్టం చేశారు. మంచి స్క్రిప్ట్ కనుక దొరికితే తెలుగులో ఓ సినిమా తప్పక డైరెక్ట్ చేస్తానంటూ ఎస్ జె సూర్య అన్నారు. నేను తెలుగు ‘స్పైడర్’ సినిమా చేశాను. కొన్ని డబ్బింగ్ చిత్రాలతో పలకరించాను. అన్నింట్లో నాని, వివేక్ ఆత్రేయతో చేసిన ‘సరిపోదా శనివారం’ సినిమాతో నాకు తెలుగులో గుర్తింపు వచ్చింది అంటూ సూర్య స్పష్టం చేశాడు.