‘నేనింతే’ ఫేమ్ శియా గౌతమ్ ప్రధాన పాత్రలో ‘మరో మహాభారతం’ పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం దసరా పర్వదినాన ప్రారంభం కానుంది. జగదీష్ దూగాన దర్శకత్వంలో లక్ష్మీ నారాయణ కిల్లి, రామకృష్ణలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబరు మొదటివారంలో ప్రారంభిస్తాం. అక్టోబర్ 5న సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేస్తాం’ అన్నారు.