దాదాపు ఏడాది కాలంగా సినిమాలకు బ్రేక్ నిచ్చింది అగ్ర కథానాయిక సాయిపల్లవి. ఆమె శివకార్తికేయన్ సరసన నటిస్తున్న తాజా తమిళ చిత్రం గురువారం కశ్మీర్లో ప్రారంభమైంది. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ పతాకాలపై అగ్ర నటుడు కమల్హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘దేశభక్తి ప్రధాన కథ ఇది. నాయకానాయికల పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. సాయిపల్లవి ఛాలెంజింగ్ రోల్లో కనిపిస్తుంది. కశ్మీర్లో రెండు నెలలు షూటింగ్ జరుపుతాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సి.హెచ్.సాయి, సంగీతం: జీవీ ప్రకాష్కుమార్, రచన-దర్శకత్వం: రాజ్ కుమార్ పెరియసామి.