కరోనా వలన పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులని చూసి చలించిన సెలబ్రిటీలు తమ వంతు సాయంగా సీఎం సహాయనిధికి విరాళాలు అందజేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తమిళ నటులు సూర్య, కార్తి ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి కోటి రూపాయలు విరాళంగా అందించారు. మురుగదాస్ 25 లక్షలు, అజిత్ 25 లక్షలు, సౌందర్య రజనీకాంత్ భర్త్ విశాగణ్ కోటి రూపాయలు అందించారు. ఇక తాజాగా దర్శకుడు వెట్రిమారన్ తమిళనాడు సీఎం స్టాలిన్ను కలిసి రూ.10 లక్షల చెక్ అందించారు.
ఇక ఎడిటర్ మోహన్, ఆయన తనయుడు మోహన్ రాజా, జయం రవి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 10 లక్షల రూపాయల విరాళం అందించారు. తమిళ నటుడు శివ కార్తికేయన్ విరాళం కింద పాతిక లక్షల చెక్ను సీఎంకు అందించారు. తమిళనాడులో రోజు రోజుకు కేసులు మరింత పెరుగుతూ పోతుండడం, ఆక్సిజన్ దొరక్క ఇబ్బందులు పడుతుండడంతో సెలబ్స్ ఎవరికి తోచినంత సాయం వారు చేస్తున్నారు.