శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా నటిస్తున్న చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. మల్లి దర్శకుడు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు. ఈ నెల 13న విడుదల కానుంది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను దర్శకుడు బాబీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్ర దర్శకుడు మల్లి నాకు మంచి స్నేహితుడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇద్దరం కలిసి ఉండేవాళ్లం.
ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. రా అండ్ రస్టిక్ ఎమోషన్స్తో ఆకట్టుకుంది’ అని చెప్పారు. పల్లెటూరి నేపథ్యంలో జరిగే కథ ఇదని, యాక్షన్ డ్రామాగా ఉత్కంఠను పంచుతుందని దర్శకుడు తెలిపారు. భరణి శంకర్, సత్య, నూకరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేష్ భార్గవ్, సంగీతం: మణిశర్మ, రచన-దర్శకత్వం: మల్లి.