సూపర్ స్టార్ మహేశ్బాబు కుమార్తె సితార మరోమారు సహృదయతను చాటారు. అనాథ చిన్నారుల కోసం ఆదివారం ‘గుంటూరు కారం’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయించారు. ఏఎంబీ సినిమాస్లో మహేశ్బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ షోకు సితార హాజరై చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. వారితో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్గా కావడంతో సితారపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.