గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 30న సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. సిరివెన్నెల పార్థివదేహాన్ని అభిమానులు సినీ ప్రముఖుల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్లో ఉంచగా, ఆయనను కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు భారీగా తరలి వచ్చారు.
సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం 1:00 కు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్య క్రియలు జరుగనుండగా, ఫిలిం ఛాంబర్ నుండి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర మొదలైంది. ఈ అంతిమ యాత్రలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొంటున్నారు. కాగా, సిరివెన్నెలకు ఆరేళ్ల క్రితం క్యాన్సర్ వచ్చింది. దీంతో ఆయనకు సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బైపాస్ సర్జరీ కూడా జరిగింది. సిరివెన్నెల గత ఐదు రోజులుగా ఎక్మో మిషన్ పైనే ఉన్నారు. ఎక్మో మిషన్ పై ఉన్న తర్వాత.. క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఒబీస్ పేషెంట్ కావడం, కిడ్నీ డ్యామేజ్ కావడంతో ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకింది. దీంతో మంగళవారం 4 గంటల 7 నిమిషాల ప్రాంతంలో సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు