బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ (Banjara hills Radisson blu)పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి..పబ్ యజమానులతోపాటు సుమారు 150 మందికిపైగా అదుపులోకి తీసుకుని..బంజారాహిల్స్ పీఎస్కు తరలించారు. పబ్లో నుంచి కొకైయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు (Drugs Case) కు సంబంధించి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు ఉండగా..వీరిలో టీడీపీ ఎంపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడు, నాగబాబు కుమార్తె నిహారిక (Niharika) తోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు మీడియాలో వస్తున్న విజువల్స్ తో స్పష్టమవుతుంది.
ఈ కేసులో పోలీసులు నిహారికను విచారించిన తర్వాత నోటీసులు అందజేసి..మరోసారి విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించినట్టు తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) కూడా ఉన్నట్టు సమాచారం. పోలీసులు హోటల్పై దాడుల అనంతరం పబ్ నిర్వాహకులు అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్ను అదుపులోకి తీసుకున్న తర్వాత పబ్ను సీజ్ చేశారు.
పబ్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పబ్పై ఇప్పటికే స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ..ఆ పబ్ ఓ ప్రముఖ వ్యక్తి కుమార్తెది కావడంతో పోలీసులు చూసిచూడనట్టుగా వదిలేసినట్టు కథనాలు వస్తుండగా..దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.