ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సర్కార్ నౌకరి’ ప్రారంభోత్సవం ఇటీవల సంస్థ కార్యాలయంలో జరిగింది. నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచ్చాన్ చేయగా, మ్యాంగో మీడియా అధినేత, గాయని సునీత భర్త రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు.
సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు క్లాప్ నిచ్చారు. హీరో హీరోయిన్పై తీసిన తొలి సన్నివేశానికి గాయని సునీత కెమెరా స్విచ్చాన్ చేశారు. ఫిబ్రవరి 6 నుంచి చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంలో భావనా పళపండల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకుడు.