Simhadri Movie Re-Release | ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ‘సింహాద్రి’ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక 20ఏళ్ల కుర్రాడు ఇండస్ట్రీని షేక్ చేశాడని కథలు కథలుగా చెప్పుకున్నారు. రాజమౌళి టేకింగ్కు, తారక్ నటనకు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. సింగమలై అంటూ అభిమానులు థియేటర్లలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రెండు, మూడు వారాలు వరకు హౌజ్ ఫుల్ బోర్డులు పడ్డాయంటే సింహాద్రి యూఫోరియా అప్పట్లో ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లోనే ఈ సినిమా రూ.27 కోట్లకు పైగా షేర్ను సాధించి డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. ఇక నందమూరి అభిమానలైతే తారక్ను నెత్తిన పెట్టుకున్నారు. అప్పటికే స్టూడెంట్ నెం.1, ఆది సినిమాలతో ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తారక్.. ఈ సినిమాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు.
కాగా ఈ సినిమా ఇప్పుడు రీ-రీలీజ్కు సిద్ధమైంది. తారక్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా శనివారం 4K ప్రింట్తో రీ-రిలీజ్ కానుంది. రీ-రిలీజ్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడమనేది బహుశా ఏ సినిమాకు జరగదేమో. ఈ ఈవెంట్కు తారక్ను ఆరాధ్య దైవంగా కొలిచే విశ్వక్ సేన్ గెస్ట్గా వచ్చి.. తన స్పీచ్తో తారక్ అభిమానులకు పూనకాలు తెప్పించాడు. విశ్వక్తో పాటు ఈ ఈవెంట్కు మైత్రీ నవీన్, గోపిచంద్ మలినేని అతిథులుగా వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా జరిపారు. ఇక ఈ సినిమా మరో 24గంటల్లో రీ-రిలీజ్ కానుంది. కాగా సింహాద్రి మూవీ దాదాపు వెయ్యి స్క్రీన్లలో విడుదల కాబోతుంది. ఇక్కడే కాకుండా ఓవర్సీస్లోనూ భారీ స్థాయిలో రీ-రిలీజ్ను ప్లాన్ చేస్తున్నారట.
ఇక బుకింగ్స్ కూడా భారీ రేంజ్లోనే జరుతున్నట్లు సమాచారం. చూస్తుంటే జల్సా, పోకిరి రీ-రిలీజ్ రికార్డులను అవలీలగా సాధించేట్టు కనిపిస్తుంది. ఇక ఇంతకు ముందు తారక్ నటించిన బాద్షా, ఆంధ్రావాలా రీ-రిలీజ్లు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోవడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సింహాద్రి రీ-రిలీజ్ను పెద్ద లెవల్లోనే ప్లాన్ చేస్తున్నారు. ఇక శనివారం కొత్త సినిమా రేంజ్లో సింహాద్రి థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది.