కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం వారిసు (Varisu) సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ వంశీపైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. విజయ్ తొలిసారి తెలుగు దర్శకుడితో పనిచేస్తుండటంతో అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన థీ దళపతి పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ పాటకు కోలీవుడ్ స్టార్ హీరో శింబు గొంతు కలిపాడని తెలిసిందే.
శింబు పాడటమే కాకుండా మ్యూజిక్ వీడియోలో కూడా భాగం అయ్యాడు. వారిసు ఆడియో లాంఛ్ ఈవెంట్ లో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ పాట కోసం శింబు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. విజయ్పై ఉన్న అభిమానంతో సాంగ్కు గొంతు అందించాడు శింబు. శింబు ఇచ్చిన ఆతిథ్యం చూసి ఫిదా అయిపోయానని అన్నాడు విజయ్. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుండగా.. తెలుగులో వారసుడు టైటిల్తో వస్తోంది. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.
వారిసులో ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వారిసు సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
థీ దళపతి మ్యూజిక్ వీడియో..