Sidhu Jonnalagadda-Bommarillu Bhasker | జోష్ సినిమాలో కాలేజ్ గ్యాంగ్లో ఒకడిగా కెరీర్ స్టార్ట్ చేశాడు సిద్దూ జొన్నలగడ్డ. ఆ తర్వాత ఆరెంజ్ సినిమాలో జెనీలియను లవ్ చేసే స్టూడెంట్ రోల్లో కనిపించాడు. ఈ సినిమాలో కాస్త స్క్రీన్ స్పేస్ ఎక్కువే దక్కింది. అయితే ఆ తర్వాత సిద్దూ చేసిన ఒక్క సినిమా కూడా తన కెరీర్కు ఎలాంటి ప్లస్ అవ్వలేదు. దాంతో తనే రైటర్ అవతారం ఎత్తి గుంటూరు టాకీస్ సినిమా చేశాడు. కట్ చేస్తే సినిమా బంపర్ హిట్. కానీ సిద్దూకు మాత్రం మరీ అంత గొప్ప పేరైతే రాలేదు. అడల్ట్ సబ్జెక్ట్ అవడమో? మరేదో కారణమో తెలియదు కానీ సిద్దూకు మాత్రం పెద్దగా పేరు రాలేదు. అయితే లాక్ డౌన్ టైమ్లో వచ్చిన కృష్ణ అండ్ ఈజ్ లీలా మాత్రం కాస్త క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఈ సినిమాకు కూడా రైటర్ ఆయనే. ఈ సినిమా తర్వాత జనాలకు సిద్దూ పేరు బాగానే రిజస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన మా వింత గాధ వినుమా కూడా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక గతేడాది వచ్చిన డీజే టిల్లు మాత్రం సిద్దూకు మంచి బ్రేక్ ఇచ్చింది. పద్నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న రాని గుర్తింపు డీజే టిల్లు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో సిద్దూకు యూత్లో మాములు క్రేజ్ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇక ఇదిలా ఉంటే సిద్దూ తన తదుపరి సినిమా ఎవరితోనా అన్నది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
ఆ మధ్య ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కొన డెబ్యూ సినిమాలో హీరోగా నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని టాక్. అయితే ఆ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ లేదని తెలుస్తుంది. ఈ లోగా సిద్దూ జొన్నలగడ్డ మరో దర్శకుడితో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఆరెంజ్ సినిమా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్తో సిద్దూ నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆగస్టు 10న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభం కానున్నాయట. ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చుతున్నట్లు ఇన్సైడ్.
దీన్ని బట్టి చూస్తే డీజే టిల్లు సీక్వెల్ తర్వాత ఇదే ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది. ఇక చిరంజీవి-కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకక్కనున్న ప్రాజెక్ట్లో కూడా సిద్దూ మరో హీరోగా నటిస్తున్నట్లు ఆ మధ్య చర్చలు జరిగాయి. అయితే సిద్దూ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని తెలుస్తుంది. సిద్దూ పాత్రను శర్వా రీ ప్లేస్ చేస్తాడని ఇన్సైడ్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే చిత్రబృందం నుంచి అఫిషియాల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.