Sidhu Jonnalagadda | పద్నాలుగేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని గుర్తింపు డీజే టిల్లుతో సిద్ధు జొన్నలగడ్డకి వచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత సినిమాలు విడుదల చేయాలా? వద్ధా? అనే సంధిగ్ధంలో ఉన్న టాలీవుడ్ దర్శక నిర్మాతలకు ‘డీజే టిల్లు’ సినిమా ధైర్యాన్నిచ్చింది. సిద్ధూజొన్నల గడ్డకు యూత్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. గతేడాది మార్చి 12 చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ను పూర్తి చేసుకుని భారీ వసూళ్ళను సాధించింది. సిద్ధూ జొన్నలగడ్డ నటన, తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ యూత్నే కాదు ఫ్యామిలీ ఆడియోన్స్ను మెప్పించాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది.
ఇదిలా ఉంటే తాజాగా సిద్ధూకు సుకుమార్ స్కూల్ నుండి పిలుపు వచ్చినట్లుత తెలుస్తుంది. టిల్లూ స్క్వేర్ తర్వాత సుకుమార్ ప్రొడక్షన్ హౌజ్లో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా సుకుమార్ శిశ్యుడే దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక టిల్లూ స్క్వేర్ విషయానికొస్తే సీక్వెల్ చిత్రానికి కూడా సిద్ధూ కథను అందిస్తున్నాడు. కాగా ఈ సీక్వెల్ చిత్రాన్ని కొత్త దర్శకుడు మల్లిక్రామ్ తెరకెక్కిస్తున్నాడు. గతంలో ఆయన తేజ సజ్జాతో ‘అద్భుతం’ సినిమా తీశాడు. కాగా మొదటి భాగానికి దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ.. హీరోతో బేధాబిప్రాయాలు రావడంతో సినిమా నుండి తప్పుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.