బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. డిసెంబర్లో వీరి పెండ్లికి బాజా మోగనుందని సమాచారం. గత కొద్దికాలంగా ఈ జంట ప్రేమలో ఉన్నారు. ‘షేర్షా’ చిత్రంలో కలిసి నటించినప్పటి నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కియారా, సిద్ధార్థ్..తమకు పెళ్లి చేసుకునే ఆలోచనలు ఉన్నట్లు తెలిపారు. దాంతో ఈ జంట ప్రేమ, పెళ్లి గురించి అందరికి స్పష్టత వచ్చింది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్లో వీరి పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లన్నీ కొలిక్కి వచ్చాక ఈ ప్రేమ జంట తమ పెళ్లి విషయం స్వయంగా వెల్లడించనున్నట్లు తెలుస్తున్నది. సిద్ధార్థ్ మల్హోత్రా కొత్త సినిమా ‘థాంక్ గాడ్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం అతని ఖాతాలో ‘యోధ’, ‘మిషన్ మజ్ను’ చిత్రాలున్నాయి. కియారా అద్వానీ తెలుగులో రామ్ చరణ్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నది.