సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డిజె టిల్లు’. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ‘డిజె టిల్లు’ ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశి మాట్లాడుతూ…నాకు బాగా నచ్చిన కథ ఇది. కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. ఈనెల 11న సినిమాను విడుదల చేస్తున్నాం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తాం. అన్నారు. ఆద్యంతం నవ్వుకునేలా సినిమా ఉంటుందని, త్రివిక్రమ్ స్క్రిప్టు గురించి సలహాలు ఇచ్చి ప్రోత్సహించారని, ఖచ్చితంగా విజయం అందుకుంటామని, మరో రెండు చిత్రాలు కూడా ఇదే సంస్థలో చేయబోతున్నానని తెలిపారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. రాధిక పాత్రలో నేను నటించగలను అని నమ్మిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నేను కథ విన్నప్పుడు ఎంతగా నవ్వుకున్నానో, థియేటర్ లో ప్రేక్షకులు కూడా అంతే వినోదాన్ని ఆస్వాదిస్తారు అని చెప్పింది నాయిక నేహా శెట్టి. ఈ కార్యక్రమంలో నటుడు ప్రిన్స్, దర్శకుడు విమల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.