చైల్డ్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన దీపక్ సరోజ్ ఇప్పుడు యువ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి అగ్ర దర్శకుల వద్ద పనిచేసిన వి.యశస్వి ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం.1గా నిర్మాణమవుతున్నది. ఈ నెల 23న సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోమవారం ప్రకటించారు.
యూనిక్ కాన్సెఫ్ట్, కంటెంట్తో రూపొందిన ఈ చిత్రానికి ముఖ్య తారాగణం: దీపక్ సరోజ్, తన్వి నేగి, నందిని, ఆనంద్, కల్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: రథన్. సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి, బాలాజీ, పూర్ణాచారి, వి.యశస్వి, నిర్మాతలు: జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన, కథ-స్క్రీన్ప్లే-మాటలు-దర్శకత్వం: వి.యశస్వి.