దీపక్ సరోజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. వి.యశస్వీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ‘నువ్వెవరో మరి’ అంటూ సాగే మూడో గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. రధన్ సంగీతాన్నందించిన ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యాన్ని సమకూర్చారు.
బెన్నీ దయాల్ ఆలపించారు. హీరో మనస్తత్వాన్ని తెలియజేస్తూ ప్రేమ తాలూకు అతని ఆలోచనలకు అద్దం పట్టిందీ గీతం. విభిన్నమైన ప్రేమకథా చిత్రమిదని, ఇప్పటికే విడుదలైన టీజర్కు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేశారని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె నాయుడు, నిర్మాతలు: జయ ఆడపాక, ప్రదీప్పూడి, సుధాకర్ బోయిన, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: వి.యశస్వీ.