హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ (Saina Nehwal)కు ప్రముఖ హీరో సిద్ధార్థ్ (Siddharth) బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లో పర్యటించిన సందర్భంలో ఎదురైన భద్రతా లోపంపై సైనా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ట్వీట్పై సిద్ధార్థ స్పందిస్తూ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సందర్భంలో ట్వీట్పై వివరణ ఇచ్చాడు. తాను ఎవరినీ కించపరచలేదని, తన ట్వీట్లో ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంటూనే సైనాకు క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖ విడుదల చేశాడు.
సైనా ట్వీట్పై తాను పెట్టిన పోస్ట్ ఒక జోక్ మాత్రమేనని వివరణ ఇచ్చాడు. అయితే, తాను పెట్టిన కామెంట్ చాలా మందిని బాధించిందని, మహిళలను కించపరుస్తూ కామెంట్స్ చేయాలనే ఉద్దేశం తనది కాదంటూ వివరణ ఇచ్చాడు. సైనా నెహ్వాల్ ఎప్పుడు ఒక గొప్ప క్రీడాకారిణి అని.. తాను ఆమెను గౌరవిస్తానని అన్నారు. అంతేకాదు తాను పెట్టిన పోస్టు చాలా మందిని బాధపెట్టిందని.. కనుక అలాంటి తాను పోస్ట్ చేసిన కామెంట్స్పై క్షమాపణ కోరున్నాననంటూ ట్వీట్ చేశాడు.