హైదరాబాద్, నవంబర్ 27 (నమసే ్తతెలంగాణ): రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ముందుకు సాగుతున్నది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా గ్రీన్ ఇండియా చాలెంజ్ని శనివారం స్వీకరించారు. ముంబయిలోని అందేరి వెస్ట్ చిత్రకూట్ స్టూడియోలో తన తాజా సినిమా ‘యోధ’ చిత్రీకరణలో పాల్గొంటున్న సిద్ధార్థ్ ..సినిమా డైరెక్టర్లు సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజాతో కలిసి మొక్కలను నాటారు. సినిమా ముహుర్తానికి ముందే మొక్కలు నాటి ఒక అద్భుతమైన సంప్రదాయానికి డైరెక్టర్లు తెరతీశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ…. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా గ్లోబల్ వార్మింగ్ని అరికట్టి భవిష్యత్త్ తరాల మనుగడకు అవకాశం కల్పించవచ్చన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలని సిద్ధార్థ్ పిలుపునిచ్చారు.