నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. చివరిగా టక్ జగదీష్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన నాని ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ అంటూ పలకరించబోతున్నాడు. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడని తెలుస్తుంది.
శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి నటిస్తున్నారు. డిసెంబర్ 24న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇంది ఆసక్తిని రేకెత్తిస్తుంది.
గురువారం ఉదయం ఏఎంబీ మాల్లో టీజర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనిలో భాగంగా టీజర్ను సోషల్మీడియా వేదికగా చిత్రబృందం షేర్ చేసింది. నటీనటుల నటన, టీజర్ ముందు వచ్చే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘‘స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు. ఆఖరికి దేవుడికి కూడా. ఖబడ్దార్’’ అంటూ శ్యామ్సింగారాయ్ పాత్రలో నాని చెప్పే డైలాగ్లు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేలా ఉన్నాయి.ఈ చిత్రం నానికి మంచి విజయం అందిస్తుందని అంటున్నారు.