నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగ రామ్. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో డిసెంబర్ 24న చిత్రం విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు.
రైజ్ ఆఫ్ శ్యామ్ ఫుల్ లిరికల్ సాంగ్ని కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీ పాడిన ఈ పాట ఉర్రూతలూగిస్తుంది. అరే ఎగసెగిసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్.. అరే తిరగబడిన సంగ్రామం వాడే.. అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది. శ్యామ్ సింగ రాయ్ ఒక లెజెండ్ గా ఎలా మారాడో ఈ పాట వివరిస్తుంది. మెలోడీ సాంగ్స్ స్పెసిలిస్ట్ గా పిలబడే మిక్కీ జె మేయర్ ఈ పాటకు తన స్టైల్ కు భిన్నమైన ట్యూన్ కంపోజ్ చేశారు.
శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో నాని రెండు పాత్రలు పోషిస్తుండగా, ఇందులో సాయి పల్లవి , కృతి శెట్టి ,మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్ జంగా దీనికి కథ సమకూర్చారు.